Saturday, April 27, 2024

యాదాద్రి లో మరో 36 మందికి కరోనా… లెక్క 72

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయం పై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే 36 మంది కరోనా బారిన పడగా, ఆదివారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రత్యేకమెడికల్ క్యాంపును
నిర్వహించి 312 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో మరో 36 మంది ఆలయ అర్చకులు, ఉద్యోగులకు కరోనా సోకింది. ఇదే పరీక్షల్లో మరో ఇద్దరు జర్నలిస్టులకు కూడా పాజిటివ్ రావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. దేవస్థానంలో మొత్తం 12 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే అప్రమత్తమైన దేవస్థానం భక్తులచే జరిపించే ఆర్జిత సేవలను 3 రోజుల పాటు నిలిపివేసింది.

ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ స్వామి
వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ
బ్రహ్మోత్సవాల నిర్వహణలో దేవస్థానం కరోనా నిబంధనలను గాలికి
వదిలేసిందనే విమర్శలు వినవస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement