Tuesday, April 30, 2024

Railway : వేసవి సెలవులకు 30ప్ర‌త్యేక రైళ్లు…

వేసవి సెలవులను పురస్కరించుకొని 30 ప్రత్యేక రైళ్లను 150 సర్వీసులుగా నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. ఏప్రిల్‌, మే నెలల్లో సొంతూళ్లకు, పర్యాటక స్థలాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు.

వారి సౌకర్యార్థం తాంబరం – తిరునల్వేలి, సెంగోట్టై, చెన్నై ఎగ్మూర్‌ నుంచి నాగర్‌కోయిల్‌, కన్నియాకుమారి, వేలాంకన్ని, చెన్నై సెంట్రల్‌ – కోవై, తిరువనంతపురం, బెంగళూరు సహా వివిధ మార్గాల్లో 30 ప్రత్యేక రైళ్లను 150 సర్వీసులుగా నడుపుతామని తెలిపారు. ఈ రైళ్ల టైంటేబుల్‌ త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement