Saturday, May 4, 2024

బస్ బోల్తా – 24 మంది దుర్మరణం

మొరాకోలో ప్యాసింజర్లతో వెళ్తోన్న ఓ బస్సు ప్రమాదకరమైన మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో బోల్తా కొట్టింది. ప్రమాదంలో 24 మందిమృతి చెందినట్లు తెలిపింది మొరాకో వార్తా సంస్థ.సెంట్రల్ మొరాకోలోని అజిలాల్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

డెమ్నాట్‌లోని వీక్లీ మార్కెట్‌కు వెళ్తోన్న ఓ బస్సు రోడ్డు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 24 ముంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించిన సమాచారం అందగానే రాయల్ జెండర్మీర్ పౌర రక్షణ సంస్థ వారు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement