Friday, May 3, 2024

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి. ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1,09,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,25,168 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 14,684 మంది కోలుకోగా, 29 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి పెరిగిందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 0.25కు చేరిందని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.84 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement