Tuesday, April 30, 2024

కొత్తగా 16,047 కరోనా కేసులు.. 54 మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా… దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు కాగా… కరోనాతో 54 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,26,826 మంది మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్‌నుంచి బయటపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement