Wednesday, May 22, 2024

నేటి బంగారం ధ‌ర‌లు-పెరిగిన వెండి

నేటి బంగారం ధ‌ర‌లు పెరిగాయి.అదే దారిలో వెండి రేటు కూడా పెరిగింది. కాగా హైదరాబాద్‌లో బంగారం ధర పైపైకి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 47,950కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా మెరిసిగింది. 10 గ్రాములకు రూ. 440 మేర పెరిగింది. దీంతో ఈ బంగారం రేటు రూ. 52,310కు చేరింది. బంగారం ధరలు గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు మాత్రం గోల్డ్ రేటు పైపైకి దూసుకుపోయింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ రేటు భారీగా పెరిగింది. పైపైకి కదిలింది. ఏకంగా రూ. 1500 మేర ర్యాలీ చేసింది. వెండి కొనాలని చూసే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెండి రేటు ఈరోజు కేజీకి రూ. 64,500కు చేరింది. సిల్వర్ రేటు కూడా గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటూ వచ్చింది. ఈ రోజు మాత్రం దూసుకుపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement