Saturday, May 18, 2024

ఒకే కాలేజ్ లో …ఒకే రోజు… 140 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ స్పీడ్ పెరిగింది. ఒక మండలం కాదు…ఒక ఊరు కాదు…ఏకంగా ఓకే ఒక కాలేజ్ లో ఒక్క రోజులో 140మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఓ కాలేజ్ లో కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి మొన్న కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆదివారం ఇంకో 10 కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇవాళ 140 కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం కాలేజ్ లో 700 మందికి ఈ పరీక్షలు నిర్వహించగా 163 మందికి పాజిటివ్ గా తేలింది. ఇక పాజిటివ్ వచ్చిన వారిని ఓ భవనం లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్ వచ్చున వారిని వేరొక చోటికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement