Sunday, May 5, 2024

సాగర్ లో సమరానికి నో…మల్లన్న క్లారిటీ

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి… ఎవరూ ఊహించని రీతిలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెమటలు పట్టించాడు తీన్మార్ మల్లన్న. అతి తక్కువ ఓట్లతోనే ఈ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న ఓటమి చెందారు. అయితే మల్లన్న ఓటమి తరువాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ… ప్రగతిభవన్ గోడలు బద్ధలు కొట్టే రోజు వచ్చిందని ఆయన అన్నారు. దీనితో అందరూ కూడా నాగార్జునసాగర్ ఉపఎన్నికల లో మల్లన్న పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది.

మరోవైపు బిజెపి తరఫున పోటీ చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇదే విషయమై ప్రభా న్యూస్ డిజిటల్ టీం ఆయనను సంప్రదించగా… క్లారిటీ ఇవ్వని మల్లన్న ట్విట్టర్ వేదికగా స్పందించారు.నాగార్జున సాగర్ లో పోటీ చేయను.. ఏ పార్టీలో చేరను. ఇదే ఫైనల్ అంటూ ట్వీట్ చేశారు మల్లన్న.

Advertisement

తాజా వార్తలు

Advertisement