Thursday, May 9, 2024

సేంద్రియ సాగుకు హెక్టారుకు 12,200 సాయం, రసాయన రహిత సాగుకు ప్రోత్సాహకాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ర‌సాయ‌న‌ర‌హిత సాగు కోసం గత రెండేళ్లుగా భార‌తీయ ప్ర‌కృతి కృషి ప‌ద్ద‌తి (బీపీకేపీ) పథకం, ప‌రంప‌రాగ‌త్ కృషి వికాస్ యోజ‌న ప‌థ‌కాన్ని క్షేత్ర‌స్థాయిలో 16 రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సేంద్రీయ వ్యవ‌సాయానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లేంట‌ని టీఆర్ఎస్ లోక్‌సభాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రరావు ప్ర‌శ్నించారు. రాష్ట్రాల‌ వారీగా సేంద్రీయ సాగులో కేంద్రం తీసుకున్న చర్య‌లను తెలపాల‌ని లోక్‌స‌భ‌ ద్వారా కేంద్రాన్ని కోరారు.

కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ ఎంపీ నామా ప్రశ్నలకు లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానమిచ్చారు. వ‌ర్మీ కంపోస్ట్, పశు వ్యర్థాల‌తో భూమి సారవంతానికి చ‌ర్యలు తీసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. హెక్టారుకు రూ. 12,200 ఆర్థిక సాయం అంద‌జేస్తూ స్థానికంగా సేంద్రీయ సాగును ప్రోత్స‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement