Sunday, April 28, 2024

31న కేసీఆర్ కరీంనగర్​ టూర్​.. రాజన్న, అంజన్నను దర్శించుకోనున్న సీఎం..

ఫుణ్య‌క్షేత్రాల సంద‌ర్శ‌ణ‌లో భాగంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. మొన్నామ‌ధ్య మ‌హారాష్ట్ర‌లో అమ్మ‌వారిని ద‌ర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అదేవిధంగా నిన్న యాదాద్రిలో మ‌రో చ‌రిత్ర‌కు పునాది వేస్తూ.. ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త అధ్యయాన్ని లిఖించారు. కొత్త‌గా నిర్మించిన నార‌సింహుడి ఆల‌యాన్ని పునఃప్రారంభించి.. శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఇక ఎల్లుండి అంటే 31వ తేదీన వేములవాడ రాజన్నను, కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. ఈమేరకు కొండగట్టులో సీఎం కేసీఆర్​ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ , అధికారులు, ప్రజాప్రతినిధులు ఇవ్వాల పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement