Thursday, May 2, 2024

హైదరాబాద్ : షర్మిల లోటస్ పాండ్ సమావేశం నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందుకు నాందిగా నేడు లోటస్ పాండ్ లో ఆమె ఏర్పాటు చేసిన సమావేశంపైనే అందరి దృష్టీ ఉంది.  అభిమానులతో భేటీ అంటున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారేలా ఆమె సమావేశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ రోజు వైఎస్ షర్మిల ఉమ్మడి నల్గొండ జిల్లాల నాయకులతో భేటీ కానున్నారు. సమావేశం కోసం షర్మిల బెంగళూరు నుంచి ఈ రోజు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement