Monday, April 29, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు  తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 148 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,96,950కి చేరింది. అదే సమయంలో ఒకరు కరోనా కారణంగా కన్నుమూశారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,620కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1640 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement