Saturday, May 4, 2024

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయ లక్ష్మి?!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు కొత్త మేయర్ గా గద్వాల విజయలక్ష్మిని సీఎం కేసిఆర్ ఖరారు చేశారు.జీహెచ్ ఎంసి ఎన్నికలలో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందారు.   ఈ  ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం పది గంటలకు కార్పొరేటర్లుగా గెలిచిన పార్టీ నేతలు.. ఎక్స్ అఫిషియో సభ్యులు తెలంగాణ భవన్ కు చేరుకుని అక్కడి నుంచి బస్సులో బల్దియా భవనానికి వెళ్లాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీల్డ్ కవర్ లో మేయర్ పేరును పంపుతానని కేసిఆర్ చెప్పడంతో   ఉత్కంఠ పెరిగిపోయింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్  మేయర్ పదవిని బీసీకి ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాల  సమాచారం. పార్టీ సీనియర్ నేత కేకే మంగళవారం ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.గత ఎన్నికలలో ఇచ్చిన హామీని గుర్తు చేసిన కేకే తన కుమార్తె  గద్వాల విజయలక్ష్మికి మేయర్ పదవిని ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో బీజేపీ బీసీలకు రాజ్యాధికారం అప్పగించాలని చేస్తున్న డిమాండ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేసిఆర్ కు కేకే సూచించారని అంటున్నారు.
కేకే నిర్ణయంతో ఏకీభవించిన కేసిఆర్ బీసీలకే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో బాటు, గద్వాల విజయలక్ష్మి పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపటిలో ఈ విషయంపై స్పష్టత రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement