Wednesday, May 15, 2024

న్యూఢిల్లీ : రైతుల రైల్ రోకో 18న

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ఈ నెల 18న దేశ వ్యాప్త రైల్ రోకో నిర్వహించతలపెట్టారు. ఈ నెల 18 దేశ వ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో నిర్వహించాలని రైతుల సంఘాలు పిలుపునిచ్చాయి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైల్ రోకో జరగనుంది. రెండు నెలల పదిహేడు రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రంలో కదలిక రాలేదని, కొత్త అగ్రి చట్టాలు రైతులకు హానికరంగా ఉన్నాయనీ సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement