Thursday, May 2, 2024

హైదరాబాద్ : ఖమ్మం నేతలతో షర్మిల భేటీ

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలలో భాగంగా   భాగంగా ఖమ్మం జిల్లా నేతలతో  నేడు సమావేశమయ్యారు.  . ఈ నెల 21న ఖమ్మంలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. పోడు భూములు అజెండాగా ఖమ్మంలో ఈ సమ్మేళనం నిర్వహించనున్నారు. వైఎస్సార్ అభిమానులతో పాటు గిరిజనులతో షర్మిల సమావేశం అవుతారు. అంతకు ముందు 21 న ఉదయం లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్‌తో ర్యాలీగా షర్మిల ఖమ్మం వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement