Sunday, May 5, 2024

షర్మిల పార్టీపై స్పందించొద్దు

హైదరాబాద్:- వైఎస్ షర్మిల పార్టీపై ఎవరూ  స్పందించొద్దని టీఆర్ఎస్ నేతలకు ప్రగతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. తాజా ఆదేశాలతో టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అలర్ట్ అయ్యింది. షర్మిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన  పోస్టులు తొలగిస్తున్నారు. పార్టీ ఏర్పాటు వార్తల నేపథ్యంలో.. ‘‘అన్న అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లి జగన్‌ను ప్రశ్నించాలి’’ అంటూ ఆమెపై టీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేశారు. తెలంగాణలో ఏం పని చెల్లెమ్మా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చెప్పుల దండలు వేసిన షర్మిల ఫ్లెక్సీలను సైతం వైరల్ చేశారు. అయితే పార్టీ పెద్దల ఆదేశంతో షర్మిలపై పెట్టిన వ్యతిరేక పోస్టులను, ఫోటోలను తొలగిస్తున్నారు. షర్మిల నిర్ణయం వెనక ఎవరున్నారన్న దానిపై ఇప్పటికే గుసగుసలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ తాజా చర్యలతో ఆ చర్చలకు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమె పార్టీ ఏర్పాటులో బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ పేర్లు తెరమీదకు వస్తుండగా.. టీఆర్ఎస్ అధినాయకత్వం తాజా ఆదేశాలు కొత్త చర్చకు ఊతమిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement