Thursday, May 2, 2024

‘శశి’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన పవన్

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘శశి’ సినిమా ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం విడుదల చేశారు. శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుర‌భి, రాశీసింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఒకే ఒక లోకం’పాట ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ‘మ‌నం ఏదైనా సాధించాల‌నుకున్న‌ప్పుడు ముందు మ‌న బ‌ల‌హీన‌త‌ల‌ను గెల‌వాలి’ అంటూ ఆది చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. ‘మ‌న‌ల్ని చూసి ఎవ‌డైనా భ‌య‌ప‌డాలి కానీ, ఎవ‌డినో చూసి మ‌నం భ‌య‌ప‌డ‌డం ఏంటీ’ అంటూ హీరోయిన్ కూడా ఓ డైలాగు కొట్టింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement