Sunday, April 28, 2024

వైసీపీ ఎంపీగా ఉన్నందుకు సిగ్గు పడుతున్నా: RRR

మహిళా దినోత్సవం రోజున అమరావతిలో దుర్గమ్మ ఆశీర్వాదం కోసం వెళ్తున్న మహిళలను అడ్డుకోవడం అన్యాయమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు(RRR) వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంపీగా ఈ ఘటన పట్ల సిగ్గుపడుతున్నానని ఆరోపించారు. మహిళా హోంమంత్రి కూడా స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇక తనపై సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తూ సహచర ఎంపీలకు లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement