Monday, April 29, 2024

రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ఉప్పెన’

లాక్ డౌన్ తర్వాత నిరాశలో ఉన్న తెలుగు చిత్రసీమకు ‘ఉప్పెన’ కెరటమై ఊపిరి పోసింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మూవీ ద్వారా మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా .. బుచ్చిబాబు దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషించగా.. కృతి శెట్టి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమైంది. ఇక సినిమా విడుదల కాగానే, సూపర్ హిట్ అన్న టాక్ ఏకగ్రీవంగా వచ్చేసింది. ప్రేమకథల్లో ఒక సంచలనంగా నిలిచింది. కాగా తమ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ శనివారం నాడు అధికారికంగా ప్రకటించింది. ‘ఉప్పెనంత మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఓ పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement