Saturday, April 27, 2024

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్ ఓపెన్- దివిజ్, అంకిత ఓటమి

 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పురుషుల డబుల్స్‌, మహిళల డబుల్స్‌లో భారత్‌ కథ ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండులోనే భారత టెన్నిస్‌ ప్లేయర్లు దివిజ్‌శరణ్‌, అంకిత రైనా ఓటమిపాలై నిష్క్రమించారు.గురువారం జరిగిన మొదటిరౌండులో వీరు వరుస సెట్లలో ఓటమిపాలయ్యారు.గ్రాండ్‌స్లామ్‌ మెయిన్‌ డ్రాలో భారత్‌ తరఫున ఆడిన అంకిత తన భాగస్వామి మిహిలాతో కలిసి బరిలోకి దిగింది. ఈ జోడీ ఆస్ట్రేలియాకు చెందిన ఒలివియా గడెక్కీ, బెలిండా వుల్‌కాక్‌ చేతిలో 3-6, 0-6 తేడాతో పరాజయం పాలైంది.అదేవిధంగా పురుషుల డబుల్స్‌లో దివిజ్‌, ఇగోర్‌ జీలెనేతో కలిసి బరిలోకి దిగాడు. ఈ జోడీ జర్మనీ జంట యాన్నిక్‌, కెవిన్‌ చేతుల్లో 1-6, 4-6 తేడాతో ఓటమిపాలైంది. కాగా పురుషుల డబుల్స్‌లో తొలి రౌండ్‌లోనే బుధవారం ఓటమిపాలైన బోపన్న మాత్రమే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌ తరఫున పోటీపడనున్నాడు. చైనాకు చెందిన యింగ్‌యింగ్‌తో కలిసి అమెరికా జోడీతో తలపడనున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మూడోరౌండులోకి స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ప్రవేశించాడు. ప్రత్యర్థి మైఖేల్‌పై 6-1, 6-4, 6-2తేడాతో విజయం సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement