Sunday, April 28, 2024

పాక్ మాజీ క్రికేట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌కు నోటీసులు

పాక్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ కిస్థాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌పై టీవీలో చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ షో నుంచి షోయెబ్ అక‌స్మాత్తుగా వెళ్లిపోయాడు. ఒప్పందాల‌ను ఉల్లంఘించిన నేప‌థ్యంలో అక్త‌ర్‌కు నోటీసులు ఇచ్చిన‌ట్లు పాకిస్థాన్ స్పోర్ట్స్ టీవీ లీగ‌ల్ నోటీసులు పంపిన‌ట్టు తెలుస్తుంది.ఎటువంటి స‌మాచారం ఇవ్వ‌కుండా టీవీ షో నుంచి వెళ్లిపోవ‌డంతో పాటు దుబాయ్ నుంచి కూడా వెనుదిరిగి వెళ్లాడు. హ‌ర్భ‌జ‌న్‌తో జ‌రిగే ఓ ఇండియ‌న్ టీవీ షో నుంచి కూడా అక్త‌ర్ అర్ధాంత‌రంగా డీల్ ముగించేశాడు. న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌కుంటే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు పూనుకుంటామ‌ని పీటీవీ యాజ‌మాన్యం అక్త‌ర్‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement