హైదరాబాద్ లోని మంచిరేవుల పేకాట కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసలో హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శివలింగప్రసాద్ ను పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. శివలింగప్రసాద్ తో కలిసి సుమన్ పేకాట దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫామ్ హౌస్ పేకాట కేసులో ప్రధాన నిందితుడుగా గుత్తా సుమన్ పేరు వినిపిస్తున్నా.. ఈయనతో పాటు మరో వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అనంతలో ఆసక్తికర సీన్.. పరిటాలను ఆలింగనం చేసుకున్న జేసీ
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily