Sunday, May 5, 2024

న్యూఢిల్లీ : విద్వేషానికి యూపీ సీఎం యోగి బ్రాండ్ అంబాసిడర్ : బృంద కారత్

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై సీపీఎం నాయకురాలు బృందా కరత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యోగి ఆదిత్యనాథ్ కు పదవి కంటే విద్వేషానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సరిగ్గా సరిపోతారని ఆమె పేర్కొన్నారు.  కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ చేసిన లవ్‌ జిహాదీ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.న్యూఢిల్లీలో   విూడియా సమావేశంలో మాట్లాడిన బృందా కారత్‌ కేరళ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు యోగి కుట్ర పన్నారని ఆరోపించారు.   కేరళలో భారతీయ జనతా పార్టీ యువవెూర్చా ఆధ్వర్యంలో జరిగిన విజయయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన యోగి   కేరళలో లవ్‌ జిహాదీని ప్రోత్సహించి రాష్టాన్ని ముస్లిం ప్రాంతంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించిన బృందా కారత్  యోగిపై విమర్శలు గుప్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement