Thursday, May 9, 2024

న్యూఢిల్లీ : ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ కు సుప్రీంలో ఊరట

ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బిల్డ్ ఏపీ అంశంలో తప్పుడు అఫడవిట్ సమర్పించారంటూ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement