Thursday, May 2, 2024

నైజీరియాలో విద్యార్థుల విద్యార్థుల కిడ్నాప్

నైజీరియాలో పదుల సంఖ్యలో  విద్యార్థులు కిడ్నాప్ కు గురయ్యారు. నైజీరియాలోని కగారా ప్రభుత్వ సైన్స్ కాలేజీ, హాస్టల్ పై సైనిక దుస్తుల్లో సాయుధులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆ సాయుధ ముఠా ఒక విద్యార్థిని కాల్చి చంపింది. పదుల సంఖ్యలో విద్యార్థులు, కొందరు టీచర్లను కిడ్నాప్ చేసి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిపోయింది. సహాయక చర్యల కోసం నైజీరిగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. సంఘటన జరిగిన సమయంలో పాఠశాలలో 560 మంది విద్యార్థులు ఉన్నారు. సాయుధ దుండగుల చెరలో ఉన్న విద్యార్థులను విడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement