Saturday, May 4, 2024

కరోనా వ్యాప్తి- పుణెలో 28 వరకూ రాత్రి కర్ఫ్యూ

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న ఐదు రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. ఇప్పటికే ఆ రాష్ట్రంరలోని అమరావతి జిల్లాలో రెండు రోజుల పాటు పూర్తి స్థాయి కరోనా లాక్ డౌన్ విధించారు. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రత ప్రమ ఘంటికలు మోగిస్తున్నది. తాజాగా పుణె నగరంలో కూడా కరోనా కేసుల సంఖ్య ఆందోళణ కర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ నెల 28 వరకూ రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ పుణె అధికారులు ప్రకటించారు. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరూ బయటకు రావడానికి వీల్లేదని పూణె కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా విద్యాసంస్థలన్నీ ఈ నెల 28 వరకూ మూసి ఉంచాలని ఆదేశించారు. కాగా మహా సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించాలని యోచిస్తున్నది. ఈ విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement