Saturday, April 20, 2024

లూసిఫర్ రీమేక్ లో ‘త్రిష’

లూసిఫర్ మలయాళ హిట్ చిత్రం ఇంది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో హీరో సోదరి పాత్ర అత్యంత కీలకం. మలయాళంలో ఆ పాత్రను ప్రముఖ నటి మంజు వారియర్ పోషించారు. ముఖ్యమంత్రి కూతురిగా హుందాగా ఉంటూనే ఎన్నో భావాలను అవలీలగా పలికించారు. తెలుగులో ఆ పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి మొదలైంది.  ఓ దశలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత నయనతార పేరు తెర మీదకు వచ్చింది. నయన్ కన్ఫామ్ అని కూడా వార్తలు వచ్చాయి. అయితే అవేవీ నిజం కావు.`లూసిఫర్` తెలుగు రీమేక్‌లో చిరంజీవి సోదరి పాత్రను హీరోయిన్ త్రిష పోషించబోతోంది. ఇప్పటికే చిత్ర దర్శకుడు త్రిషను సంప్రదించాడని, ఆ రోల్ చేసేందుకు ఆమె అంగీకరించిందని సమాచారం వచ్చింది.  గతంలో చిరంజీవి, త్రిష `స్టాలిన్` సినిమాలో జంటగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న `ఆచార్య`లో హీరోయిన్‌గా ముందుగా త్రిషనే ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి కాజల్ వచ్చి చేరింది. `లూసిఫర్` రీమేక్‌లో మాత్రం నటించడానికి త్రిష అంగీకరించింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement