Sunday, April 28, 2024

షింజే హత్య ఎవరిపని..?

జపాన్‌ మాజీ ప్రధాని షింజే అబే గురువారంనాడు కాల్పులకు గురైన మరణించడం అత్యంత విషాదకరం. ఆయన ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యులు ఎంత ప్రయ త్నించినా ప్రయోజనం లేకపోయింది. దేశంలో ఆయన కు ప్రత్యర్ధులు లేరుఆయన హత్య ఊహకందని విష యం.. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదా అన్నమాటలే ఇందుకు నిదర్శనం.అబే నుంచి తాను ఎన్నో విషయాల ను నేర్చుకున్నాననీ, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని కిషిదా అన్నారు.ఆయన హత్య పట్ల యావత్‌ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన జనాదరణ పొందిన నాయకుణ్ణి దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. అయితే, చైనాలో మాత్రం షింజే అబే హత్య పట్ల సంబరాలు జరుపుకుం టున్నట్టు వార్తలు సమాచారం.జపాన్‌లో ఆర్థిక సుస్థిరత కోసం షింజే అబే ఎంతోకృషి చేశారు.ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి కోసం పాటు పడ్డారు.ఆయన జపాన్‌ కి రెండు సార్లు ప్రధానిగా వ్యవహరించారు.ఆయన తాత నోబుషికే ప్రధానిగానూ తండ్రి షింటారో అబే విదేశాంగ మంత్రిగానూ పని చేశారు. అబే హయాంలో ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను పటిష్టం చేయడానికి ఎంతో కృషి చేశారు. మన దేశంతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి.అయితే,ఆయన ముక్కు సూటితనమే ప్రాణం మీదికి తెచ్చిందేమోనని అనుమా నిస్తున్న వారున్నారు. తైవాన్‌ విషయంలో చైనాదూకు డును ప్రదర్శిస్తే, అమెరికా, జపాన్‌లు చూస్తూ ఊరుకోవ ని ఆయన ఓ సందర్భంలో హెచ్చరించారు. అంతేకాకుం డా, వాణిజ్యం విషయంలో చైనా అనుసరిస్తున్న విధానా లను ఆయన పలు సందర్భాల్లో విమర్శించారు.షింజే అబే అమెరికా, ఆస్ట్రేలియా, తదితర దేశాలకు సన్నిహి తంగా ఉండటం చైనాకు కంటగింపుగా ఉండేది. చైనా పొరుగు దేశాల భౌగోళిక సరిహద్దులను దాటి ఆక్రమణ ధోరణిని ప్రదర్శించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

జపాన్‌లో ఆయుధ సంస్కృతి అమెరికాతో పోలిస్తే తక్కువే.అయితే,అబేపై కాల్పులు జరిపిన వ్యక్తి పొడ వాటి దేశీయ తుపాకీని ప్రయోగించినట్టు ప్రాథమికవార్త లు సూచిస్తున్నాయి. ఆదివారం జరగనున్న ఎన్నికలకు లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి తరఫున టోక్యోకి పశ్చిమాన 300 మైళ్ళ దూరంలో నారా నగరంలో ప్రచారానికి ఆయన వెళ్ళారు. ఆయనపై కాల్పులు జరిపిన వ్యక్తి పూర్వం సైన్యంలో పని చేశాడు.అతడు తన నేరాన్ని అంగీకరిస్తూనే, షింజే అబె విధానాలు నచ్చక పోవడం వల్లనే తాను కాల్పులు జరిపానని వాంగ్మూలం ఇచ్చాడు. షింజే అబే వి ధానాలకు దేశంలో పెద్ద వ్యతిరే కత లేదు. అయితే, పొరుగుదేశాల ప్రోద్బలంపై అతడు ఇంతటి దురాగతానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నా రు. జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయన ఎక్కువ గా కృషి చేశారు. దీంతో చైనా, దక్షిణ కొరియాలు ఆయన పై గుర్రు పెంచుకున్నాయి.అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో దీవుల విషయంలో ఆయన కరుకుగా వ్యవహరించారు. ఆ దీవులన్నింటినీ కైవసం చేసుకోవా లని చైనా ప్రయత్నాలు సాగించింది. ఇప్పటికీ సాగిస్తోం ది. చైనా ప్రయత్నాలను ప్రతిఘటించడంలో వియ త్నాం, తదితర దేశాలకు జపాన్‌ అండగా నిలిచింది. దాంతో జపాన్‌పై చైనా కక్ష పెంచుకుంది. వాణిజ్యం విషయంలోకూడా జపాన్‌ తమకు పోటీగా తయారైం దనే భావన చైనా, దక్షిణ కొరియాలకు ఏర్పడింది. అలాగే, ఉక్రెయిన్‌పై రష్యాదాడిని జపాన్‌ ఖండించింది. ఈ దాడివల్ల పొరుగు దేశాల విశ్వసనీయతను కోల్పోన వల్సి వస్తుందని షింజే అబే రష్యాను హెచ్చరించారు.

అమెరికా, భారత్‌, దక్షిణాఫ్రికాలతో కలసి చైనాకు వ్యతిరే కంగా క్వాడ్‌ కూటమిని ఏ ర్పాటు చేయడంలో షింజే అబే కీలక పాత్ర వహించారు.క్వాడ్‌ కూటమి ఏర్పాటుతో చైనా గడగడలాడింది. ఆయనపై చైనా గుర్రు పెంచుకోవడాని కి అది కూడాఒక కారణం. షింజే అబే హత్య పట్ల అన్ని దేశాలూ తీవ్ర దిగ్భ్రాంతినీ, విచారాన్ని వ్యక్తం చేశాయి. జపాన్‌కి పెద్ద ఎగుమతిదారు. చైనాకు జపాన్‌ ఎగుమతు లు గడిచిన 25 సంవత్సరాల్లో 6.3 శాతం పెరిగాయి. 2020లో చైనాకు జపాన్‌ ఎగుమతులు 133బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 1995లో జపాన్‌ ఎగుమతులు 151 బిలియన్‌ డాలర్లు ఉండేవి. ఇరుదేశాల మధ్య వాణి జ్యం తగ్గడానికి యుద్ధ నేరాల గుర్తింపు విషయంలో వచ్చిన మనస్పర్ధలే. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వల్ల ఇరుదేశాలమధ్య స్పర్దలు పెరిగాయి. నరేంద్రమోడీ ప్రధానిగా వచ్చిన తర్వాత జపాన్‌తో సంబంధాలు క్రమంగా మెరుగు అవుతున్నాయి. అంతకుముందు 11 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నవాణిజ్యం రెండేళ్ళ క్రితం 18 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. షింజే అబేకి అంతశ్శత్రువుల కన్నా బాహ్య శత్రువులే ఎక్కువమంది ఉన్నారు. ఆయన హత్యను ఆ కోణం నుంచే చూడాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement