Saturday, April 27, 2024

వెూహినీ ఏకాదశి ఉపవాసం వెయ్యి గోవుల దానఫలం!

భగవాన్‌ విష్ణు స్త్రీ అవతారమెత్తిన రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి. ఈరోజు విష్ణుమూర్తి మోహినీ రూపాన్ని ధరించిన రోజును మోహినీ ఏకాదశిగా హిందువులు జరుపుకుంటారు. దేవ దానవుల క్షీర సాగర మధనంలో, అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది. కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన దేవ దానవుల మద్య జరిగిన పోరులో, దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవుతారు. అప్పుడు వారి చేష్టల వల్ల లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించిన దేవతలు, మహా విష్ణువే సమస్యకు పరిష్కా రాన్ని చూపాలని వైకుంఠనాథుని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగడం కన్నా, తెలివితో జయించవచ్చని భావించిన విష్ణువు, అప్సరస వంటి మోహినీ రూపాన్ని ధరించాడు. మోహినీ అనగా ఆకర్షణ అని అర్ధం కూడా. అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన మోహిని, దానవులకు అనుమానం రాకుండా దేవతలకు అమృ తాన్ని అందివ్వడంలో సఫ లీకృతమైంది. ఆ కారణం చేతనే దేవతలు అమరుల యినట్లు పురాణ కథనం. మోహిని ఏకాదశి గొప్పతనాన్ని మొదట రాముడికి వశిష్ఠులవారు, యుధిష్టిరునికి శ్రీకృష్ణుడు వివరించారు. మో#హని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే.. తీర్థయాత్రలను సందర్శిం చడం, దానం లేదా యజ్ఞా లు చేయడం ద్వారా సాధిం చిన పుణ్యం కంటే చాలా ఎక్కువ పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉపవాసం ద్వారా వెయ్యి ఆవులను దానం చేయడం ద్వారా సాధించినంత కీర్తిని పొందు తారని చెపుతారు. రోజంతా నిష్ఠతో దేవుని భక్తి శ్రద్దలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్ధిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర, లాభదాయక జీవ నానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. వ్రతాన్ని ఆచరించే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి తద్వారా మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. దశమి సాయంత్రం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఉపవాస దీక్షను చేయవలసి ఉంటుంది. ఏకాదశి మరియు ద్వాదశి మధ్య రాత్రి సమయంలో జాగరణ సూచించ బడినది. విష్ణువును పూలతో పూజించుట, విష్ణు సహస్ర నామం పఠించడం, భజనల్లో పాల్గొనడం, దేవాలయాలకు వెళ్ళడం, హారతిని సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని పెట్టడం ఆచరణీయం. దాన ధర్మాలు చేయకుండా ఏకాదశి వ్రతం పూర్తికాదు. అర్హులైన… పేదల కు లేదా అవసరమైన వారికి దానధర్మాలు చేయడం విధిగా సూచించబడినది. తద్వారా అన్నదానాలు, గోవుల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటివి చేయడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు. ఎక్కువసేపు ఉపవాస దీక్ష చేయలేని వారు, ఆరోగ్యం సరిగ్గా లేని వారు, వయసు పైబడిన వారు ఉపవాస దీక్షలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదా విరమించుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. మధుమేహ, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, జీర్ణ సంబంధ సమస్యలు మొదలైనవి ఉన్నవారు ఉపవాసాల విషయంలో జాగ రూకతతో ఉండాలి.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 9449595494
Advertisement

తాజా వార్తలు

Advertisement