Friday, April 26, 2024

భగవంతుని అనుగ్రహాన్ని అందుకోగలగాలి!

పూజలు, నోములు, వ్రతాలు, అర్చనలు, ఆరాధన లు, అభిషేకాలు, తీర్థయాత్రలు, దక్షిణలు, ప్రదక్షిణలు, నామస్మరణలు యిలాంటి పనులన్నింటినీ మనం ఆధ్యా త్మికం అంటున్నాం. అనుకుంటున్నాం. ఇవేవీ కానివి, వీటికి సంబంధం లేని ఇతరత్రా పనులన్నిటినీ లౌకికమని అంటున్నాం. నిజానికి పూజలు, వ్రతాలు వంటివన్నీ ఆధ్యాత్మి కానికి మనల్ని తీసుకువెళ్ళే మార్గాలు. సాధనా సరం జామాలు. కానీ అవే అసలు సిసలైన ‘ఆధ్యాత్మికం’ అని అనలేం.
‘నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమైన, విశాలమైన ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం. రాక్షసత్వం నుంచి పశుత్వానికి, పశుత్వం నుంచి మానవ త్వానికి, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవ టమే ఆధ్యాత్మికం. సంకుచిత్వం నుంచి సంయుక్త తత్వా నికి, ఆటవికం నుంచి ఆత్మ తత్వానికి చేరుకోవటమే అస లు సిసలు ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మికం అనేసరికి పూర్వజన్మ, సుకృతం, కర్మఫ లం, ప్రాప్తం, అప్రాప్తం అనే మాటల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అన్నీ వాతంతట అవే అమరిపోయి అన్నీ చకాచకా జరిగిపోతుంటే, ‘ఆహా! అది వాడి ప్రాప్తం’ అంటాం. అలా జరగక ఎదురు తిరిగితే ప్రాప్తం లేదం టాం. పూర్వజన్మ ఫలం అంటాం. కర్మ అనుభవించాలి అంటాం.
అప్రాప్తం అని కూడా అంటాం. ఆచార్య ఆత్రేయ గారన్నట్టు ”తలచింది జరిగిందంటే అంతా మన ప్రతిభ అనంటాం. తలచింది జరగని నాడు తలరాతంటూ విధిపై నెడతాం.”
అయితే భగవంతుడి అనుగ్రహం అనేది ప్రాప్తా ప్రాప్తాలు, పూర్వజన్మలు, కర్మలు, సుకృతాల మీదే ఆధా రపడి ఉండదు. మన సాధన మీద, ప్రయత్నం మీద, దీక్ష మీద, మనం ఉండే స్థితి మీద, సంసిద్ధత మీద కూడా భగ వంతుడి అనుగ్ర#హం ఆధారపడి ఉంటుంది.
ద్వాపర యుగంలో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన ఇంటిలో నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. కృష్ణుని పెదవులను అంటుకుని వేణువు, దివ్యమైన వేణు గానాన్ని కృష్ణుడు వేణువును ఊదకుండానే వినిపిస్తోంది. వేణుగానం వినవస్తుంటే చుట్టుపక్కల అందరూ అక్కడికి చేరుకున్నారు. వేణువు అదృష్టాన్ని అందరూ అభినందిం చారు. వేణువును పొగడ్తలతో ముంచెత్తారు.
వేణువుకి అందరూ ఆ రకంగా తనని పొగిడే తీరు కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ”నన్ను అలా పొగ డవద్దు. నాలో అహంకారం తలెత్తవచ్చు.” అని వారిం చింది వేణువు.
కొంతసేపైన తర్వాత ఆ కృష్ణయ్యకు వేణువు అంటే కొంచెం ఎక్కువ ఆపేక్ష అనీ అది కృష్ణుని పక్షపాత బుద్ధికి నిదర్శనమనీ, కొందరి గుసగుసలు మెల్లగా వేణువు చెవిన పడ్డాయి.
అప్పుడు వేణువు యిలా అంది. ”నా శరీరాన్ని చూడండి. తొమ్మిది గుండ్రని రంధ్రాలతో, ఎంత గుల్లగా నా శరీరం ఉందో! చూసేరా? బాగా గుల్లగా ఉంటూ ఆ నల్లనయ్య నాలో చాలా సులువుగా ప్రవేశించేలా నేను ఉన్నాను. ఉంటున్నాను. ఆ స్థితిలో ఉండగలుగుతున్నా ను. మరి మీరో? మీకూ నాలాగే నవ రంధ్రాలే ఉన్నాయి. మీ నవరంధ్రాల నిండా, మీరు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, అహంకార మమకార అసూయలను పూర్తిగా నింపుకుంటున్నారు. నల్లనయ్య తన అనుగ్రహం తో, మీలో చొరబడాలని ఎంత ప్రయత్నించినా, చొరబడ లేనంత స్థిరంగా ఉంటున్నారు. ఏ మాత్రం గుల్లదనం లేకుండా, దృఢంగా మీ శరీరాలను ఉంచుకుంటున్నారు. కృష్ణయ్య మీలో చొరబడటానికి అవకాశం ఏమాత్రం అ నల్లనయ్యకు ఈయడం లేదు. ఈయకుండా, మీరు ఆ రకంగా ఉంటున్నారు. అలాంటప్పుడు మీలో ఆ కృష్ణ య్య దివ్యగానాన్ని ఏ రకంగా వినిపించగలడు?” అని అసలు రహస్యాన్ని వివరించింది వేణువు.
అవును. భగవంతుడు సహవర్తి. సమవర్తి. అంద రూ ఆయనకు సమానులే. ఆయనకు తరతమ బేధం అనేది ఏ కోసాన లేదు. సర్వులకూ సమస్త జీవులకూ తన అనుగ్రహాన్ని సమంగా అందించే తత్వం భగవంతునిది. భగవంతుడు తన అనుగ్రహాన్ని అందరి మీద నిండుగా కురిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు.
అయితే అందుకోడానికి మనం సంసిద్ధులమై ఉం డాలి. మనసా, వాచా, కర్మణా, మనం సిద్ధమై ఉండాలి. సిద్ధపడి ఉండాలి. హృదయాన్ని తెరుచుకుని స్వచ్ఛం గా భగవంతుని కోసం మనం తపన పడాలి. తపిస్తూ ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement