Thursday, May 2, 2024

Tirumala : తిరుమలలో భక్తుల కొండంత రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి దాదాపు అన్ని కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర‌న్పాట్లు చేశారు. నిన్న స్వామివారిని 72,176 మంది భక్తులు దర్శించుకోగా 25,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement