Thursday, May 2, 2024

Tirumala: తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ…

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. దీంతో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. టోకెన్ లేని భక్తుల దర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం శ్రీవారిని 70,373 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 32,954 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement