Tuesday, May 21, 2024

శ్రీవారి సేవలోగవర్నర్‌ బిశ్వభూషణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ గురు వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్న ర్‌కు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌ జెట్టి సాదర స్వాగతం పలికారు. అర్చక బృందం ‘ఇస్తికఫాల్‌’ ఆలయ మర్యాదలతో దేవాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు. రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు బహూకరించారు. అంతకు ముందు తిరుమల శ్రీ పద్మావతి వసతి సముదాయం వద్ద టీటీడీ ఉన్నతాధికారులు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనవరాలి వివాహ వేడుకల్లో గవర్నర్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం చెంతన జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ వధూవరులు సుష్మ, కిషన్‌లను గవర్నర్‌ ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement