Tuesday, May 14, 2024

భక్తులను సంరక్షించే ద్వారకామాయి

శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అధర్మం పెచ్చు మీరినప్పుడు ధర్మ సంస్థాపనకై ఏదో రూపం లో ఈ భువిపై అవతరిస్తాను అని వాగ్దానం చేసారు. అట్లే ప్రతీ యుగం నందు ఆ పరమాత్మ ధర్మ సంస్థా పన కోసం ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే వున్నా రు. సాధువులు, పుణ్యమూర్తులు, అవతార పురుషు లు ఆ పరమాత్మ యొక్క ప్రతిరూపాలే. అట్లా మన దేశంలో హందు, ముస్లింలు తమలో తాము కల హంచుకుంటూ, పెద్దఎత్తున మతఘర్షణలకు పా ల్పడుతున్నప్పుడు వారిలో వారికి సద్భావం, మత సామరస్యం నెలకొల్పడానికి, అపరిశుద్ధ, పరి బ్ర హ్మ మహారాష్ట్రలోని శిరిడీ గ్రామంలో సాయినాథు ని గ్రామములో అవతరించారు. చిరిగిన చొక్కా, చీ నా రేకు డబ్బా, ఫకీరు రూపంలో ‘అల్లా మాలిక్‌’ అం టూ ఒక విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటింపజేస్తూ మానవాళిని ఉద్ధరించడానికి వచ్చిన అవతారమే శ్రీ సాయి. ఆయన సంపూర్ణ కరుణా కటాక్షాలను పొం దిన కుటుంబం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మేనేజర్‌ అనే అతను బొంబాయిలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. మేనేజర్‌ దంపతులిద్దరికీ బాబాలన్నా, సాధువులన్నా ఏమా త్రం నమ్మకం లేదు. ఒకసారి వారి పదిహను నెలల బిడ్దకు తీవ్ర అనారోగ్యం సంభవించింది. బిడ్డ కళ్ళు తేలేసి, నిశ్చలం అయిపోయాడు. స్పెషలిస్ట్‌ డాక్టర్ల కు చూపించినా ఫలితం స్వల్పం. సరిగ్గా అంతలోనే బాబాకు భక్తుడైన మేనేజర్‌ తమ్ముడు వచ్చి సాయి నాథుని లీలలు గూర్చి తెలిపి, ఊదీ ప్రసాదాలను వారికి అందించాడు. ఏ పుట్టలో ఏ పాముందో? అనుకొని శ్రీమతి మేనేజర్‌ ఆ ఊదీని పిల్లవాడికి పట్టించి, అనారోగ్యం తగ్గితే శిరిడీ వస్తానని మొక్కు కుంది. ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం. పిల్లవాని అనా రోగ్యం తగ్గనారంభించి ఏ డాక్టర్‌ సహాయం లేకుం డానే నాలుగు రోజుల్లోనే స్వస్థత చేకూరింది. అన్న మాట ప్రకారం శ్రీమతి మేనేజర్‌ తన పిల్లవాడిని, మరొక సేవకుడిని తీసుకొని శిరిడీ వెళ్ళింది. మశీదు లో భక్తుల మధ్య కూర్చొనివున్న సాయి శ్రీమతి మేనే జర్‌ను చూడగానే ”రామ్మా! నీకోసమే ఎదురు చూ స్తున్నాను. పిల్లవానికి అనారోగ్యం తగ్గింది కదా!” అని నవ్వుతూ పలకరించారు. బాబా వారి సర్వాంత ర్యామి తత్వానికి శ్రీమతి మేనేజర్‌ మదమొందింది.
శ్రీమతి మేనేజర్‌తో పాటు శిరిడీ వెళ్ళిన సేవకు డు తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతుందే వా డు. నిరక్షరాస్యుడైనా, అతనికి దైవం పట్ల అచంచల విశ్వాసం, ప్రేమ, భక్తి వున్నాయి. మశీదులో బాబా ఎదుట కూర్చొని బాబా నామస్మరణ చేసుకుంటూ వుండగా బాబా హఠాత్తుగా ”నా నడుమ చాలా నొప్పిగా వుంది.” అని అన్నారు. ఎవరో భక్తుడు ”మీ బాధ తగ్గాలంటే ఏం చెయ్యాలి బాబా” అని అడుగ గా ”లెండీ తోటలో వున్న కలబంద ఆకులు తెచ్చి వేడి చేసి, నొప్పి వున్నచోట కడితే నొప్పి తగ్గుతుంది” అని బాబా ఆ సేవకుని వైపు చిరునవ్వుతో చూసారు. ఆశ్చర్యంతో బాబా చెప్పినట్లే చేయగా, ఆ సేవకుని నడుం నొప్పి వెంటనే తగ్గిపోయింది.
మరొకసారి సకుటుంబ సపరివార సమేతంగా శిరిడీ వచ్చి దర్శనం చేసుకున్న శ్రీమతి మెనేజర్‌తో శ్రీ సాయి ”ఈ రోజు నీకు గండం వుంది, జాగ్రత్తగా వుండు” అని అన్నారు. ఆ మాటలకు భయపడిన శ్రీమతి మేనేజర్‌తో తిరిగి శ్రీ సాయి ”ఏం భయపడ వలదు. ఈ ద్వారకామాయి అత్యంత దయార్ద్ర హృ దయం కలది. ఈ మశీదు మెట్లు ఎక్కిన మరుక్షణం తన భక్తుల సంరక్షణ బాధ్యత తానే స్వయంగా చూసుకుంటుంది.” అని అన్నారు. ఆ సాయంత్రం శిరిడీలోని వీధిలో చీకటిలో శ్రీమతి మేనేజర్‌ నడు స్తుండగా ఎవరో ఆపినట్లు ఆగింది. ఎటునుంచో వెలుగు ప్రసరించి ”ముందుకు చూడు” అన్న మా టలు వినిపించాయి. ఆతృతగా ముందుకు చూసిన ఆమెకు రోడ్డుకు అడ్డంగా బుసలు కొడుతూ పడుకొ ని వున్న విష సర్పం కనిపించింది. ఇంకొక అడుగు వేసి వుంటే పాముపై అడుగుపడి ఆవిడ ప్రాణాలు పోయి వుండేవి. ఆ సర్పం వెంటనే పాక్కుంటూ వెళ్ళిపోయింది. ప్రాణాపాయ స్థితి నుండి ఆమెను సాయిబాబా ఆ విధం గా కాపాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement