Friday, May 3, 2024

పాలు తాగుతున్న నంది విగ్రహం

ఆలయానికి క్యూ కట్టిన జనాలు
ఒంగోలు, ప్రభ న్యూస్‌ బ్యూరో : ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తిన పురంలో వింత ఘటన చర్చనీయాంశ మైంది. ఆలయం ప్రాంగణంలో జంటనా గుల పుట్ట దగ్గర నందీశ్వరుని విగ్రహం పాలు తాగుతుందని తెలియడంతో భక్తు లు క్యూ కట్టారు. పోలేరమ్మ దేవస్దానం దగ్గర భక్తుల కోలాహాలం కనిపిస్తోంది. అందరూ నందిశ్వరునికి స్పూన్‌లతో పాలు పట్టిస్తున్నారు. నందీశ్వరుడు పాలు తాగుతుండటంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వింతను చూసేందుకు చీరాల పరిసర ప్రాంతాల నుంచి అర్దరాత్రి దాటిన జనాలు భారీ సంఖ్యలో వస్తు న్నారు. ఇలాంటి తరహా ఘటనే చిత్తూరు జిల్లాలో మరొకటి జరిగింది. చిత్తూరు పట్టణంలోని మార్కెట్‌ చౌక్‌ వద్ద ఉన్న శివాలయంలో ఓ నంది విగ్రహం నీళ్లు తాగుతుంది. అక్కడున్న కొందరు చెంచాతో నంది విగ్రహానికి నీళ్లు పట్టించగా.. ఆ విగ్రహం నీళ్లను తాగేస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది. దీంతో ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకి ఊరంతా తెలియడంతో ఆలయం వద్ద భక్తులు క్యూ కట్టారు.మహా శివరాత్రి మహోత్సవం ముగిసిన తర్వాత ఇలాంటిది జరగడంతో ఇదంతా పరమశివుడి లీలంటూ అక్కడికి వచ్చిన భక్తులు అనుకుంటు-న్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు నంది విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ఘటనలు మాత్రమే కాదు.. గతంలోనూ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు రామాలయంలోని శ్రీరాముడు, సీతా, లక్ష్మణుడి విగ్రహాల కంటి నుంచి నీళ్లు రావడం అప్పట్లో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement