Saturday, May 4, 2024

గాయత్రి బీజాక్షర ఆధార ఆలయాలు

ఇరవైనాలుగు బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగిపోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ. కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరి ష్కారం గాయత్రీ. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ. 24 బీజాక్షర సంపుటి గాయ త్రీ.. గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైన, మహమాన్వితమైనది,

గాయత్రి మంత్రం పఠనము…

చాలామందికి గాయత్రీ మంత్రమనేది ఒక టి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలి సినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రా న్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి ‘హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను!’ అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలిపే చిన్న ప్రయత్నమిది.

”ఓం భూర్భువస్సువ: తత్‌ సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహ, ధియో యోన: ప్రచోద యాత్‌”

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగుచోట్ల ఆపి చద వాలి. అది ఎలాగంటే-
ఓం
భూర్భువస్సువ:
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహ
ధియో యోన: ప్రచోదయాత్‌
ఇలా మంత్రం మధ్యలో నాలుగుసార్లు ఆపి చదవాలి. ఈ మంత్రములో ‘ఓం’ అనేది ‘ప్రణ వము’, ‘భూర్భువస్సువ:’లోని భూ, భువ:, సువ: అనేవి ‘వ్యాహృతులు’. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. ‘తత్‌’ నుంచి మిగిలిన భాగాన్ని ‘సావిత్రి’ అని అంటారు. గాయత్రి మం త్రంలో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన గొప్ప ఆలయాలను ఒకసారి తెలుసుకుందాం.
కంచి కామాక్షి మందిరంలో అమ్మవారు మూ లవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయ త్రి మంటపం అంటారు. ఆ ప్రాకారంలో 24 స్తం భాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.
కోణార్‌లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్న ది. ఆ రథానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గం టలన్నారు. మనవాళ్ళు దాన్నే పట్టుకున్నారు.
పొరాణ కధనం ప్రకారం 24గురు ఋషు లు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. అశోకుని ధర్మచక్రంలో వున్న 24 చువ్వలు వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయ చక్రం అని కూడా అంటు న్నాము.
జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే. కేశవ నామాలు 24.
24 తత్వాలు: ఐదు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు,
ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు: ”బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”
రామాయణంలో 24 సహస్ర శ్లోకాలు.
రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపా దిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూ డండి. 1, 1001, 2001, 3001, 4001, 23001 శ్లోకాలను గనుక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామా యణం అని కూడా అంటారు.
ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.
మన వెన్నుబాములో 24 మ్రుదులాస్తులు వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మం త్రాక్షరాలు.
”న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు.
గాయత్రీ మంత్రం సద్బుద్ధిని ఇస్తుంది. బుద్ది మనకు సంపదలను ప్రసాదిస్తుంది. ఆపదలను దూరం చేసి, పేరు ప్రతిష్టలను ఇస్తుంది. చెడు శక్తు లను పోగొట్టి తేజస్సును, సంస్కారాన్ని ఇస్తుంది గాయత్రీ కామధేనువు. ఎవరైతే గాయత్రీదేవి మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తారో ఆ సాధకునికి కామధేనువు తన వద్ద ఉన్నట్లే. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమే అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement