Sunday, April 28, 2024

భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్న‌.. ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్

రాజ‌స్థాన్ లో భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. బుధ‌వారం ఉదయం భడోటిలోని సవాయ్‌ మందిర్‌ నుంచి యాత్రను మొదలుపెట్టారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. కాగా ఇవాళ్టి యాత్రలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి చాలా దూరం నడిచారు. ఈ సమయంలో ఇద్దరూ చాలా విషయాల గురించి ముచ్చటించుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర.. జమ్ముకశ్మీర్‌లోని కశ్మీర్‌లో పూర్తికానున్నది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర పూర్తయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement