Monday, May 6, 2024

ధూళితో దర్శనం…స్పర్శతో పావనం…!

శ్రీశైల క్షేత్రానికి వచ్చిన భక్తులకు దర్శన మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీశైల మల్ల న్న. తనను తాకి తరించే అవకాశాన్ని కూడా భక్తు లకు ప్రసాదించాడు. భీకర కీకారణ్యాల్లో, గండ రాతి శిలల్లో పంచాక్షరీ మంత్రాన్ని ఊతంగా చేసుకుని, భక్తిప్రపత్తులనే శక్తిగా మార్చుకుని తరలివచ్చే వారిని అలాగే తన సన్నిధికి ఆహ్వాని స్తాడు మల్లికార్జునుడు. శౌచ నియమాలు అక్క ర్లేదు, విధివిధానాలు అవసరం లేదు, ‘వచ్చా ము నా తండ్రీ’ అనగానే ఒంటికి అంటిన ధూళి తోనే నన్ను తాకి తరించండని అనుమతి నిస్తాడు, దాన్నే ధూళి దర్శనం అంటారు. ఇది శ్రీశైలంలో మాత్రమే దొరికే మహద్భా గ్యం. ఎందుకంటే-
శ్రీశైల క్షేత్రానికి రవాణా సౌకర్యాలు లేని రోజులవి, దట్టమైన అడవుల్లో, నల్లమల కను మల్లో ప్రయాణం. వందల మైళ్ల దూరం కాలిన డకనే వచ్చేవారు, వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు నల్లమల పాదాల వద్దకు చేరుకోగానే నాలు గు ప్రధాన మార్గాలు ఆహ్వానం పలికేవి.
తీరాంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు శ్రీశైలా నికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపు రాంతకం చేరుకునేవారు. యర్రగొండపాలెం, వేంకటాద్రి పాలెం, గంజివారిపల్లి, దుద్దనల, నాగూరు మీదుగా తెలగ వారి చెరువు వచ్చేవా రు. కొండ మార్గంలో చింతల, పెద్ద ఆరుట్ల,, చి న్న ఆరుట్ల దాటి శిఖరేశ్వరంలో వీర శంకర స్వామిని సేవించుకునేవారు.
అక్కడి నుంచి ముందుకు వెళ్లలేని వారు నందికొమ్ముల నుంచి ఆలయాన్ని దర్శించుకుని వెనుతిరిగేవారు. అందువల్లనే శ్రీశైల శిఖరం దర్శించినంతనే పునర్జన్మ ఉండదనే భావన ప్రచారం చెందినట్లు చెప్పొచ్చు.
భీమునికొలను మార్గం: రాయలసీమ నుంచి వ చ్చే భక్తులు శ్రీశైలం దక్షిణ ద్వారమైన సిద్ధవటం నుంచి.., మరికొందరు పశ్చిమ ద్వారమైన అలంపురం నుంచి బయలుదేరి నంద్యాల, ఆత్మకూరు, కృష్ణాపురం, వెంకటాపురం, సిద్దా పురం మీదుగా నాగలూటి వచ్చేవారు. భీముని కొలను ద్వారా కైలాస ద్వారం చేరుకొని ఆల
యాన్ని చేరుకుని స్వామిని దర్శించేవారు. ఇది ఆ రోజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన మార్గం.
నీలిగంగ మార్గం: నాగర్‌ కర్నూల్‌, అమ్రాబా ద్‌, తెలకపల్లి మీదుగా ప్రయాణం చేసే తెలంగా ణ ప్రాంత ప్రజలు మొదట శ్రీశైల ఉత్తర ద్వారం గా ప్రసిద్ధి చెందిన ఉమామహశ్వరం చేరుకునే వారు. అటవీ ప్రాంతంలో అప్పాపురం, భ్రమ రాంబ చెరువు, మేడిమాకుల, సంగడిగుండల మీదుగా నీలిగంగ రేవుకు వచ్చేవారు.తెప్పల ద్వారా కృష్ణా నదిని దాటి చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకొని స్వామిని దర్శించేవారు.
జాతరరేవు మార్గం: ఇది కూడా ఉమామహశ్వ రం నుంచే ప్రారంభమవుతుంది. భ్రమరాంబ చెరువు, మేడిమాకుల చేరుకొని అక్కడ నుంచి అక్కగని వద్దకు వచ్చి కృష్ణా తీరంలోని జాతర రేవును దాటుకొని చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకునేవారు..
ఈ ప్రయాణం అత్యంత కఠినమైంది కాబ ట్టే సాధారణ ఆలయాల్లో ఉండే విధి విధానాలు ఇక్కడ పాటించనవసరం లేదు.
సాధారణంగా దైవ దర్శనానికి శుచీ శుభ్ర తలను పాటిస్తూ వెళ్ళడం ఆచారం. అలాంటివి ఏమీ లేకుండా ఈ క్షేత్రానికి చేరుకుని ఆతృతగా స్వామి వారి వద్దకు వెళ్లి తమ ఆత్మీయులను ఆలింగనం చేసుకుని పలకరించినట్టుగా స్వామి వారిని తాకి, దర్శించే ఆచారం ఏర్పడింది.
వందలాది మైళ్లు కాలినడకన ప్రయాణి స్తూ మార్గమధ్యంలో క్రూర జంతువుల నుంచి, అటవికుల నుంచి తమను తాముహొ కాపాడు కుంటూ… ‘చేర్చుకో మల్లన్న… దరి చేర్చుకో మల్లన్న’ అంటూ స్వామి వారిని ప్రార్థిస్తూ క్షేత్రా నికి చేరుకొని ముందుగా స్వామిని స్పర్శించి దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
అంతేకాకుండా మార్గమంతా తమతో పా టే ఉండి, రక్షించి తన వద్దకు చేర్చుకున్నందుకు కృతజ్ఞతతో, ఉద్వేగంతో శ్రీశైలం చేరుకున్న వెను వెంటనే వెళ్లి మల్లికార్జునుడిని దర్శించుకునే వారు. అందువల్లనే ఈ విధమైన ఆచారం ఏర్ప డినట్లు చెెబుతారు. మరే శివ క్షేత్రంలోనూ ఇలాంటి అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement