Tuesday, May 14, 2024

తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి ద‌ర్శ‌నానికి 7 గంట‌ల స‌మ‌యం…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా వీరికి 7 గంటల్లో దర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న శ్రీవారిని 67,364 మంది భక్తులు దర్శించుకోగా 25,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.21 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement