Thursday, May 16, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 5 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సుమారు ఐదు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్వామివారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా నిన్న ఒక్క‌రోజు సాధార‌ణ భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగ‌గా.. నేడు మ‌ళ్లీ పెరిగింద‌ని అధికారులు అంటున్నారు. బుధవారం శ్రీవారిని 66,946 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement