Saturday, May 4, 2024

14, 15వ తేదీల్లో వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

తిరుపతి : టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 14, 15వ తేదీల్లో జరుగనున్నాయి. ఆగస్టు 13న సాయంత్రం అంకురార్పణం, సేనాధిప‌తి ఉత్స‌వంతో ఈ ఉత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ ఉత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఆగస్టు 14వ తేదీన ఉదయం యాగశాల పూజ, హోమం, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, 6 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ జ‌రుగ‌నున్నాయి.

ఆగస్టు 15న ఉదయం స్నపనతిరుమంజనం, యాగశాల పూజ నిర్వహిస్తారు. ఉద‌యం 9 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. రాత్రి 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement