Thursday, April 25, 2024

ఐపీఎల్‌లో కొత్త నిబంధన.. ఇక బౌలర్లకు చుక్కలే..!!

కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. యూఏఈ వేదికగా మిగిలిన 31 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. రెండో దశ ఐపీఎల్‌ కోసం ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించవద్దనే రూల్ తీసుకొచ్చింది.

బీసీసీఐ కొత్త నిబంధన ప్రకారం బ్యాట్స్ మెన్ బంతిని స్టాండ్‌లోకి సిక్స్‌గా బాదితే.. ఆ బంతిని తిరిగి ఉపయోగించరు. కొత్త బంతిని తీసుకొస్తారు. ప్లేయర్లు బంతిని స్టాండ్స్ అవతలకు కొడితే.. ఆ బంతిని ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున దానిని తిరిగి వాడితే ఆటగాళ్లకు కరోనా సోకే ప్రమాదం ఉంది. బంతిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత బాల్‌ను లైబ్రరీలో దాచనున్నారు. ఈసారి మ్యాచులకు ప్రేక్షకులను అనుమతిస్తున్నందున ఈ కొత్త రూల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రతిసారి ఇలా బాల్ మారిస్తే బౌలర్లకు ఇబ్బందులు తలేత్తే అవకాశం ఉంది. కొత్త బాల్ అయితే బౌలర్లకు గ్రిప్ దొరకడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా స్పిన్నర్లలకు బంతిపై పట్టుచిక్కకుండా పోతుంది. దీంతొ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్టాండ్స్‌లో పడిన బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకొస్తే బ్యాట్స్‌మెన్‌కు అడ్వాంటేజ్‌గా మారనుంది.

ఈ వార్త కూడా చదవండి: వర్షం దెబ్బకు డ్రాగా ముగిసిన తొలి టెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement