Sunday, May 5, 2024

విశాఖ శారదా పీఠాధిపతులకుమైసూరు దత్తపీఠం ఆహ్వానం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో:మైసూరులోని అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ దత్త విజయానంద తీర్థ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. దత్తపీఠం తరపున అమ్మవారికి పట్టు- వస్త్రాలను సమర్పించారు. అనంత రం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను కలిసారు. అవ ధూత దత్త పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదిన మహొ త్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. మే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పది రోజులపాటు- సాగే మహోత్సవాలలో పాల్గొనాల్సిందిగా పీఠాధిపతు లను కోరారు. అంతకుముందు మైసూరు దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద తీర్థకు జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు గురువందనం సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement