Saturday, May 18, 2024

కాశీ విశ్వనాథుని వైభవం

విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం.
ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచ సాంస్కృతిక నగరం.
స్వయంగా శివుడు నివాసముండె నగరం.
ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం.
శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు.
కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం.
ఇది లింగంలాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది.
కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు.
కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి
నీటి బిందువులాంటి సంక్షిప్త సమాచారాన్ని అందించడానికి చేసిన ఓ చిరు ప్రయాస ఇది.

కాశీ భువిపైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వ నాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమ బాధ పునర్‌ జన్మ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరు తుంది. డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తరవాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు. కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి. కాశీలో మరణిం చిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మం త్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే ‘కాశ్యాన్తు మరణాన్‌ ముక్తి’ అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలామంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్ను సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.
కాశీలోని కొన్ని వింతలు

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మంది రం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి, అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్త వారికి జాడ దొరకకుండా ఉంటుంది. మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడు కోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్దపెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యంచేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుం ది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతా యి. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగత్‌ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రధాన ఘాట్లు కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని-
దశాశ్వమేధ ఘాట్‌: బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యా గం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.
ప్రయాగ్‌ ఘాట్‌: ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా, సరస్వతిలు కలుస్తాయి.
నేపాలీ ఘాట్‌: పశుపతినాథ్‌ మందిరం బంగారు కలశంతో నేపాల్‌ రాజు కట్టించాడు.
మణి కర్ణికా ఘాట్‌: ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు వు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. గంగ నిర్మలంగా పారుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇక్కడ సుచేల స్నానంచేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
విష్వేవర్‌ ఘాట్‌: ఇప్పుడు సింధియా ఘాట్‌ అని పిలుస్తున్నా రు. ఇక్కడే అహల్యా బాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేస్తే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.
పంచ గంగాఘాట్‌: ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదు లు కలుస్తాయి.
తులసి ఘాట్‌: తులసి దాస్‌ సాధన చేసి రామచరిత మానస్‌ లిఖించమని శివుని ఆదేశం పొందినది.
హనుమాన్‌ ఘాట్‌: ఇక్కడ జరిగే రామకథ వినడానికి హను మంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తు లు పొందిన లోలార్క్‌ కుండం వున్నది.
హరిశ్చంద్ర ఘాట్‌: సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్క డ శవ దహన కూలీగా పనిచేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొంది నాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది
మానస సరోవర్‌ ఘాట్‌: ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగ ర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానంచేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.
చౌతస్సి ఘాట్‌: స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగిని లు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.
రానా మహల్‌ ఘాట్‌: ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయ కుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భ వించే తీర్థాలు కలిసి ఉంటాయి. దేవతలు, ఋషులు, రాజులూ నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో
వైభవోపే తంగా వెలుగొందింది.

– కైలాస్‌ నాగేష్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement