Wednesday, May 8, 2024

ఏపీ సీఎంకు బాలాపూర్‌ లడ్డూ

కడప , ప్రభన్యూస్‌ బ్యూరో:హైదరాబాద్‌ శివారు బాలాపూర్‌ గణపతి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్న కడప ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ మంగళవారంనాడు తాడేపల్లిలో సీఎం జగన్‌కు బహూకరించారు. ఈనెల 19న హైదరాబాద్‌లో నిమజ్జనానికి ముందు జరిగిన వేలంపాటలో తన వ్యాపార భాగస్వామి మర్రి శశాంక్‌ రెడ్డితో కలసి రూ.18.90 లక్షలకు దక్కించుకున్న రమేష్‌ సీఎంకు బహూకరిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కుటుంబ సభ్యులు, శంశాంక్‌తోసహా సీఎం జగన్‌ను కలసి లడ్డూను అందజేశారు. సీఎంగా జగన్‌ మరో 30 ఏళ్లపాటు కొనసాగాలన్న ఆకాంక్షతో బాలాపూర్‌ లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నానని, ఎలాంటి విఘ్నాలు లేకుండా పదవిలో కొనసాగాలని కోరుకున్నానని రమేష్‌ యాదవ్‌ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన రమేష్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీగా చాన్స్‌ ఇవ్వడంతో జగన్‌ను గురువుగా భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement