Friday, April 26, 2024

యంగ్ టైగర్ ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్… అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు. అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈ మేరకు ఇప్పటికే బోనీకపూర్ ను తో చిత్ర యూనిట్ సంప్రదించారట.

జాన్వీ కపూర్ ను తెలుగులో ఎంటర్ చెయ్యటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది సఫలం కాలేదు. ఇక 2018లో ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement