Monday, April 29, 2024

నువ్వొక ధ్రువ‌తార‌వి.. అభిమానికి నివాళుల‌ర్పించిన సూర్య‌

త‌న ఫ్యాన్ కి నివాళుల‌ర్పించారు త‌మిళ స్టార్ హీరో సూర్య‌. మే 6న టెక్సాస్‌లోని ఓ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐశ్వర్య సహా ఏడుగురు మృతి చెందారు. అమెరికాలోని టెక్సాస్‌ కాల్పుల ఘటనలో తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్యప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమె మ‌ర‌ణం కుటుంబంలో ఎంతో దు:ఖాన్ని నింపింది. కాగా ఐశ్వర్య.. నటుడు సూర్యకు వీరాభిమాని… ఈ క్రమంలో ఐశర్య అకాల మరణం గురించి తెలిసి ఎమోషనల్ అయ్యారు సూర్య‌. ఆమె ఫోటో వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. ఐశ్వర్య ఫ్యామిలీని ఓదార్చుతూ లేఖ రాశారు. మీ కుంటుబానికి ఎలా ధైర్యం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇది నిజంగా తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మీ గారాలపట్టి ఐశ్వర్య మరణించడం దురదృష్టకరం. ఆమె మన మెమరీస్‌లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఒక నక్షత్రంగా వెలుగుతూనే ఉంటుంద‌ని ఐశ్వర్య పేరెంట్స్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారు సూర్య. ఇవి నీ మరణానికి నివాళిగా రాస్తున్న లెట‌ర్ కాదు. నువ్వు అసలైన హీరోవి. నీ ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్‌కు నువ్వొక ధ్రువతారవు. నువ్వు పంచిన ప్రేమ, నీ చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచే ఉంటుంద‌ని రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement