Thursday, April 25, 2024

పవన్ రానా కూడా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యారట ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం మేర షూటింగ్ ను కంప్లీట్ చేసింది. కాగా మిగిలిన షూటింగ్ ను జూలై లో స్టార్ట్ చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాని మొదట ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో ఈ చిత్రం వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని చూస్తున్నారట దర్శకనిర్మాతలు. కాగా అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి మేకర్స్ ఏ విధంగా దీనిపై స్పందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement