Thursday, March 28, 2024

రష్మికను కలవడానికి 900 కి.మీ ప్రయాణించిన తెలంగాణ అభిమాని

సినిమా హీరోలు, హీరోయిన్‌లను అభిమానించే వారు చాలామంది ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా వారిని కలవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. తాజాగా రష్మిక ఫ్యాన్ ఒకరు అలాంటి పనే చేశాడు. ఎప్పుడూ తెరమీదేనా.. ఓ సారి రియల్‌గా చూద్దాం అనుకున్నాడో ఏమో.. ఆమెను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేశాడు.

తెలంగాణకు చెందిన ఆకాశ్‌ త్రిపాఠి.. రష్మికకు వీరాభిమాని. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలనుకున్నాడు. గూగుల్‌ ద్వారా ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని తెలుసుకున్నాడు. రైల్లో మైసూరుకు వెళ్లాడు. . ఆ తర్వాత సరకు రవాణా చేసే ఆటో ద్వారా రష్మిక స్వస్థలానికి చేరుకున్నాడు. అయితే అక్కడికి చేరుకున్నాక హీరోయిన్ రష్మిక ఇల్లు ఎక్కడ అంటూ… కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగాడు. అతడి ప్రవర్తన తేడాగా అనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు.. రష్మిక ​ షూటింగ్​ కోసం ముంబై వెళ్లిందని సదరు వ్యక్తిని వెనక్కిపంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement