Tuesday, April 30, 2024

ప్రియదర్శి పై అనసూయ కి ఎందుకంత కోపం ?

జబర్దస్త్… బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే షో. ఎన్ని కొత్త షో లు వచ్చినా జబర్దస్త్ ను ఇప్పటి వరకు ఢీకొట్టే లేకపోయాయి. ఇక ఈ షోకు అనసూయ యాంకర్ గా చేయగా, రోజా ,సింగర్ మను జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మొదటి నుంచి కూడా ఏదైనా సినిమా రిలీజ్ అయితే ప్రమోషన్ లో భాగంగా హీరో హీరోయిన్ లు జబర్దస్త్ కు వస్తూ ఉంటారు. వచ్చి వారి సినిమాని ప్రమోట్ చేసుకుంటారు.

తాజాగా జాతిరత్నాలు టీం జబర్దస్త్ లో ఎంటర్ అయ్యారు. నవీన్ పొలిశెట్టి,ఫరియా అబ్దుల్లా,ప్రియదర్శి వచ్చారు. ఇక మామూలుగా ప్రతి స్కిట్ అయిన తర్వాత అనసూయ జడ్జ్ లతో పాటు వచ్చినవారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటారు. కానీ ప్రియదర్శి అభిప్రాయాన్ని మాత్రం అడగలేదట. ఇలా రెండు స్కిట్ లు వరకు చూసిన ప్రియదర్శి అసంతృప్తితో షో నుంచి మధ్యలో వెళ్ళిపోయాడట. అందుకే స్టార్టింగ్ లో కనిపించిన ప్రియదర్శి పూర్తి అయ్యేవరకు లేడని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందొ తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement